Friday, May 3, 2024
Friday, May 3, 2024

అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలి

మంత్రి ఎర్రబెల్లి
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీస్‌ అమరుల సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అక్టోబర్‌ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img