Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జోరుగా పోలింగ్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ రాత్రి 7 గంటలకు ముగియనుంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం భారీగా నమోదు అయ్యింది. నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్‌ నమోదయింది. హుజూరాబాద్‌లో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img