: ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ అండగా ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జాతీయ గో మహాసమ్మేళనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి గో ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. వందల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరించి.. గో ఆధారిత వ్యవసాయంతో పండిరచిన పంటలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రసాయన ఎరువులతో తయారుచేసిన దాణా తినే ఆవుల పాల వల్ల మహిళల్లో క్యాన్సర్ పెరుగుతోందని అధ్యయనాల్లో తేలిందని.. అందువల్లే సీఎం జగన్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటానికి ముందుకు రావాలని సూచించారు.జాతీయ గో మహాసమ్మేళనం సందర్భంగా%ౌౌ% మహతి కళాక్షేత్రం ప్రాంగణంలో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు.