Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం

: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధికి ‘నాడు-నేడు’ కార్యక్రమం చేపడతామన్నారు. శాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలయ భూముల లీజులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామని, అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో విజిలెన్స్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. . దేవాలయాలు, దేవతా మూర్తుల ప్రాశస్త్యం వివరించేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 175 ఆలయాల్లో ఆన్‌ లైన్‌ సేవలు నిర్వహించేలా.. డోనేషన్లు నేరుగా ఆలయ ఖాతాలోకి వెళ్లేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఆలయంలో ఆభరణాల వివరాలు డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img