తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ తనదైన మార్కుని చూపిస్తూ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణీకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. తనదైన శైలిలో వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అర్ధరాత్రి ఓ యువతీ చేసిన ట్వీట్ కు స్పందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్లలో ఆపాలనే రూల్ ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్కు చెందిన పాలే నిషా అనే యువతి ఆర్టీసీ బస్సులను 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్లో చెప్పారు. ఆ యువతి అభ్యర్ధనకు వెంటనే ఎండి సజ్జనార్ స్పందించారు. ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ రిప్లయ్ ఇచ్చారు. ఈ రిప్లయ్ చూసి సదరు యువతీ తో పాటు ప్రయాణికులు అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.