అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు 51శాతం పదవులిచ్చిన ఎకైక రాష్ట్రం ఏపీనే అని అన్నారు. మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా మహిళలు ఇక్కడికి వచ్చారన్నారు. ఆధునిక ఏపీలో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులేనన్నారు. ఇక్కడ మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయన్నారు. ‘‘మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలరు… అని ఐన్రైన్డ్ అన్నారని’’ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ తన ముందున్నవారిలో 99 శాతం మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉన్నారని, భారతదేశ మహిళా సాధికారత చరిత్రలోనే ఇంతమంది మహిళా ప్రజా ప్రతినిధుల సమావేశం ఎక్కడా ఎప్పుడూ జరగలేదన్నారు.