Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని…మా విధానం : నారా లోకేష్‌

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని తమ విధానమని నారా లోకేష్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. నవ్వుతూ అసత్యాలు చెప్పడం జగన్‌కు అలవాటైందని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానులకే అబద్ధాలు చెప్పగలిగే ఘనుడు జగన్‌ అని దుయ్యబట్టారు. పెగాసెస్‌ తాము కొనుగోలు చేసుంటే జగన్‌ అధికారంలోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. వ్యవస్థలు శాశ్వతమని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ముందుచూపు వల్లే సీఆర్డీఏ చట్టం గెలిచిందని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఘటనపై రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతూనే ఉంటామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img