Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

నత్తనడకగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం : తులసీ రెడ్డి

వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నత్త నడక సాగుతోందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసీ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2004-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ పాలనలో 28.30 లక్షల ఇళ్లు మంజూరు అయినప్పటికీ మూడేళ్లలో, మూడు ఇళ్లు కూడా పూర్తి కాలేదని అన్నారు. యూనిట్‌ కాస్ట్‌ సరిపోక పోవడం, సకాలంలో బిల్లులు చెల్లించక పోవడం, ఇసుక కొరత, మౌలిక సదుపాయాల కొరత ఇందుకు కారణాలని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img