Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకట్లు : చంద్రబాబు

జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయని చంద్రబాబు విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు.జగన్‌ ఒక అపరిచితుడు అని, జగన్‌ రివర్స్‌ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌ లో పయనిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్‌ బలహీనత ఏంటో క్యాబినెట్‌ విస్తరణ చూస్తేనే అర్థమవుతోందని అన్నారు. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎంత బలహీనుడో అతని కేబినెట్‌ చూస్తేనే అర్థమవుతోందన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనన్నారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్‌ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్‌… ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈనెల 21న టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img