ఏపీలో మౌలిక వసతులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ‘‘తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అందుకే తెలంగాణలో కరెంట్ కోతలు లేవు. ఏపీలో కూడా విద్యుత్ కోతలు లేవు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ వ్యాఖ్యలు.’’ అని అన్నారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చు. ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించారేమోనని అన్నారు.