Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పంటల భీమా చెల్లింపుల్లో అన్నీ అవకతవకలే

: మాజీ మంత్రి దేవినేని ఉమా
జగన్‌ సర్కార్‌ తీసుకువచ్చిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకంపై మాజీ మంత్రి దేవినేని ఉమా పలు వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్‌ వేదికగా స్పందిస్తూ… ‘‘క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకం రైతుల కోసమా?. మీ పార్టీ నేతల కోసమా?. పంటల భీమా చెల్లింపుల్లో అన్నీ అవకతవకలే. వైసీపీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతున్న వ్యవహారం. లక్షల మంది అసలు రైతులకు అందని పరిహారం. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను మీ నేతలు ధీమాగా కొల్లగొడుతున్నారంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారు? సీఎం జగన్‌’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img