Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అంబులెన్స్‌ డోర్లు తెరుచుకోకపోవడంతో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి..అంబులెన్స్‌ డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్‌లో కోయమోన్‌ అనే 66 ఏళ్ల వ్యక్తి హైవే దాటుతుండగా ఓ బైక్‌ ఢీకొట్టింది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే స్థానికులు ఫోన్‌ చేయడంతో అంబులెన్స్‌ అక్కడకు చేరుకుంది. వెంటనే ఆ వ్యక్తిని ఆ అంబులెన్స్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. వేగంగా చేరుకున్నప్పటికీ అంబులెన్స్‌ డోర్లు తెరుచుకోలేదు. దాంతో అంబులెన్స్‌ డ్రైవర్‌తో సహా పలువురు వ్యక్తులు అంబులెన్స్‌ డోర్‌ను తెరవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. అలా అరగంట ప్రయత్నించారు. అయినా తెరుచుకోలేదు. అయితే వారు తలుపులను బద్దలగొట్టి ఎలాగోలా రోగిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. తలుపు తెరుచుకునే సమయానికి అంబులెన్స్‌లోనే క్షతగాత్రుడు మరణించాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి వీణాజార్జ్‌ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img