ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 14 వ రోజుకు చేరుకుంది. గుడివాడ లోని వీ కే ఆర్ కళాశాల నుండి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చళ్ళు శివాజీ, గుడివాడ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు పాల్గొని సంఫీుభావం తెలిపారు. ఈ యాత్ర నందివాడ మండలం జొన్నపాడు మీదుగా నందివాడ, తుమ్మలపల్లి, రామాపురం నుండి కుదర వల్లి మీదుగా అక్కినేని వారధి దాటి పశ్చిమ గోదావరి జిల్లా కునికి గ్రామములోకి చేరుతుంది.