Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

5న యధావిధిగా పార్టీ జనరల్‌ బాడీ మీటింగ్‌.. సీఎం కేసీఆర్‌

తెలంగాణ భవన్‌ లో దసరా రోజు (అక్టోబర్‌ 05)న ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ మీటింగ్‌ యధావిధిగా జరగుతుందని టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశంపైన ఉండదని, సభ్యులు అనుమానాలకు గురికావద్దన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్‌ 5వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయంలోపే హాజరుకావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img