Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

విహారయాత్రలో విషాదం

మున్నేరు నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

విశాలాంద్ర – పెనుగంచిప్రోలు :
ఉదయం నుంచి సరదాగా గడుపుతున్న విద్యార్థులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. అప్పటివరకు తమతో ఆటలాడుతున్న ఆ విద్యార్థులు ఒక్కసారిగా నీటిలో మునిగి చనిపోయారని తెలియడంతో తోటి విద్యార్థులు బోరున విలపించారు.
ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామం సరస్వతీ విద్యాలయంకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు శనివారం పెనుగంచిప్రోలు మున్నేరు ఒడ్డున ఉన్న మామిడి తోటలోకి పిక్నిక్ కోసం వచ్చారు. ఉదయాన్నే వచ్చిన విద్యార్థులు, వారితో వచ్చిన ఉపాధ్యాయులు ఆటపాటలతో సరదాగా గడిపారు.
సాయంత్రం నాలుగున్నర సమయంలో మున్నేరులోని మడుగులోకి నలుగురి విద్యార్థులు స్నానం చేసేందుకు దిగారు వారిలో శీలం నర్సిరెడ్డి(12) ఆరో తరగతి, నీలం జస్వంత్ (10) నాలుగో తరగతి విద్యార్థులు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు.
ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు నీటిలో మునిగిన మరో ఇద్దరిని అతి కష్టం మీద బయటకు తీశారు. మిగిలిన ఇద్దరు మృతి చెందారు. దగ్గర్లో చేపలు పడుతున్న జాలర్లు వచ్చి మృదేహాలను బయటకు తీశారు. విషాద వార్త మడుపల్లి వాసులకు తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతిలోనయ్యారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని. ఉదయభాను ఎస్ఐ,హరి ప్రసాద్ కుఫోన్ ద్వారా తెలుపగా ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img