Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

లబ్ధిదారులకు పథకాలు అందజేయడంలో వాలంటీర్లదే కీలకపాత్ర : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడంలో వాలంటీర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. రాప్తాడు మండలంలోని వాలంటీర్లతో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల నుండి అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను గుర్తిస్తూ పథకాలు మంజూరు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మరింత పారదర్శకంగా పథకాలు అందజేసేలా గ్రామ సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లను నియమించామని, వీరిలో సంబంధిత గ్రామ సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారన్నారు. సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పని తీరుపై నిరంతరం మదింపు ఉంటుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు టీడీపీకి ఓటమి తప్పదని భావించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, వాటిని తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో జగన్‌ ను సీఎంగా గెలిపిస్తే మరో 20ఏళ్లు ఆయనే సీఎంగా గెలుస్తాడన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే చంద్రబాబుతోపాటు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. వీరికి వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్దిచెప్పేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. పార్టీని గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి సచివాలయ కన్వీనర్లకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత అని అన్నారు.కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్‌, జెడ్పీటీసీ పసుపుల హేమావతి, ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, వైస్‌ ఎంపీపీలు, కన్వీనర్‌ జూటూరు శేఖర్‌, యూత్‌ కన్వీనర్‌ చిట్రెడ్డి సత్తిరెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img