విశాలాంధ్ర -గూడూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా కప్పలదొడ్డి పేద ,నిరుపేద వృద్ధ ,దివ్యాంగులకు స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆర్థిక సౌజన్యంతో 50 కుటుంబాలకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం బూసం లోకనాధం ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా పేరిశెట్టి నాగరవి ,లైబ్రరీసైన్స్ అధ్యాపకులు ,శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల పెడన పాల్గొని స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆశయం, ఆలోచన మంచిదని నిరుపేద చేనేత కార్మికులను అక్కున చేర్చుకుని ఇంతమందికీ సంక్రాంతి కానుక గా నిత్యావసర సరుకులు అందించడం అభినందించవలసిన విషయమని దాతల దాతృత్వానికి వెలకట్టలేమన్నారు.