Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రహదారి భద్రత పై అవగాహన సదస్సు…

విశాలాంధ్ర-గుంతకల్లు : రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వాహనాల తనిఖీ అధికారి ఎన్ వి రాజాబాబు మాట్లాడుతూ వాహనంలో ప్రయాణించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాల డ్రైవర్లు హెల్మెట్ ధరించాలని తెలిపారు. కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఓవర్ స్పీడ్ రఫ్ గా డ్రైవింగ్ చేయడం డ్రంకన్ డ్రైవ్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని తెలిపారు. రహదారిలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించి డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో సిబ్బంది ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img