Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఘనంగా జర్నలిస్టు తిమ్మారెడ్డి వర్ధంతి

విశాలాంధ్ర- ఉరవకొండ : స్వర్గీయ కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి కుమారుడు జర్నలిస్టుగా పనిచేసిన యల్లారెడ్డి గారి తిమ్మారెడ్డి 23 వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు, యువనేత వై. ప్రణయ్ రెడ్డి తదితరులు తిమ్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు తిమ్మారెడ్డి సమాజానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి పేద ప్రజల కోసం పనిచేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, మునిరత్నం శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్టులు విశ్వనాథ్,ఆజాద్, మల్లికార్జున, సతీష్,డి.రామాంజనేయులు, రేపటి రామాంజనేయులు,టి. రామాంజనేయులు అక్బర్,వీరయ్య, నాగరాజు, రాము, వీరన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి జర్నలిస్ట్ గా పని చేసిన కాలంలో ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారు గుర్తుకు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img