రియల్టర్ విజయభాస్కర్రెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు.హత్యకేసులో కీలక నిందితుడిని శివను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని మెదక్ ఎస్పీ చందన దీప్తి మీడియాకు తెలిపారు. శివ, పవన్, నిఖిల్ కలిసి హత్య చేశారని వెల్లడిరచారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన కారుతో పాటు డిక్కీలో పూర్తిగా కాలిపోయి ఉన్న శవం మంగళవారం దొరికిన విషయం తెలిసిందే.