Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ లను అధిక మెజార్టీతో గెలిపించండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు

విశాలాంధ్ర – ధర్మవరం:: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోతుల నాగరాజు లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో ప్రచార కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది. కత్తి నరసింహారెడ్డి పోతుల నాగరాజుల యొక్క వివరాలను తెలియజేసి, అందరికీ న్యాయం జరిగే విధంగా వారు చిత్తశుద్ధితో పనిచేస్తారని, అర్హులైన వారికే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని వారు కోరారు. అధ్యాపక, ఉపాధ్యాయ, ఉద్యమ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వీరు ఇరువురును ఎమ్మెల్సీగా గెలిపించుకొని, వారి సేవలను కొనసాగిస్తామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, నాయకులు మేడాపురం అభి, పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు జయశంకర్, రవితోపాటు మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img