Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని
గంగాభవానిదేవీ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ అన్నారు . గురువారం మండల పరిధిలోని బాపురంలో వెలసిన శ్రీ గంగాభవానిదేవీ రథోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో భాగంగా కబడ్డీ పోటీలను పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు ఆటలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. కబడ్డీ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన ప్రథమ జట్టుకు రూ. 20 వేలు, ద్వితీయ జట్టుకు 15 వేలు, తృతీయ జట్టుకు 10వేలు, నాల్గవ జట్టుకు 2 వేలు ప్రోత్సాహక బహుమతులుగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యల్లప్ప, వైసీపీ నాయకులు హనుమంతరెడ్డి, బొడ్డన్న, మహదేవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img