Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్,

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణం లోని చంద్రమౌళీశ్వర స్వామిని మరియు కరిబసవేశ్వర గవిమఠాన్ని మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మంగమ్మ,మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు తదితరులు సందర్శించారు. గవి సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.గవిమఠం విశిష్టత, చరిత్ర గురించి అర్చకులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.అంతకముందు గవిమఠం అధికారులు,అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు.శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి గవిమఠం పీఠాధిపతులు శ్రీ జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి వారిని కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గవిమఠం సహాయ కమిషనర్ చిట్టెమ్మ, స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img