నిలిచిన దిల్లీ పద్దు.. ప్రధానికి కేజ్రీవాల్ లేఖ
దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని ఆవేదన
దిల్లీలోని ఆప్ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను నిలిపివేయడం ఇదే తొలిసారి అన్నారు. దిల్లీ ప్రజలపై మీకెందుకు కోపం అంటూ ప్రశ్నించారు. దిల్లీ ప్రజలు చేతులు జోడిరచి వేడుకుంటున్నారనీ, దయచేసి తమ బడ్జెట్ ను ఆమోదించండని ఆయన కోరారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం దిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. బడ్జెట్ ప్రజెంటేషన్ను క్లియర్ చేయడానికి ముందు ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చు మౌలిక సదుపాయాల కంటే ఎందుకు ఎక్కువ ఉందో చెప్పాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రం వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రధానికి లేఖ రాశారు. దిల్లీవాసులమైన మాపై మీకెందుకు కోపం అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. దిల్లీ ప్రజలు తమ బడ్జెట్ను ఆమోదించాలని చేతులు జోడిరచి ప్రధానిని అభ్యర్థిస్తున్నారని ఆయన అన్నారు. ఓ జాతీయ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న వీడియోను ఆప్ సోమవారం షేర్ చేసింది. మంగళవారం (మార్చి 21) దిల్లీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుండాగిరి చేస్తోందని, దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను నిలిపివేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు దిల్లీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వని వరకు, బడ్జెట్కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం పెండిరగ్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.