Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

డ్వాక్రా మహిళల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం.. మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

విశాలాంధ్ర -ధర్మవరం : డ్వాక్రా మహిళల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం బ్రాహ్మణ వీధిలోని 13వ వార్డులో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ ఆసరాలో భాగంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ మూడవ సంవత్సరం ఆసరా కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల మాట్లాడుతూ నేడు మహిళల అభివృద్ధికి అండగా ఉంటూ వారి అభివృద్ధిని బాటలో నడిపింది కే ముఖ్యమంత్రి కృషి అనన్యనీయమని తెలిపారు. డ్వాక్రా మహిళలు కూడా ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల మద్దతు పలుకుతున్నారని వారు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ తీర్థాల స్వర్ణలత, కౌన్సిల్ సభ్యురాలు షమీం, వార్డు ఇంచార్జ్ తీర్థాల వెంకటరమణ, సీఈవో ప్రసన్న ,సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి నాగరత్న, ఆర్పి పద్మ, సమైక్య లీడర్లు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా 21వ వార్డు ఎస్బిఐ కాలనీలో మూడవ విడత డ్వాక్రా గ్రూప్ మహిళా సభ్యులు వైయస్సార్ ఆసరా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మి వార్డ్ ఇన్చార్జ్ కత్తే పెద్దన్న ,డ్వాక్రా గ్రూప్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పి ఉమాదేవి, సిఓలు కలిసి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకమును నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img