Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

కళ్లద్దాల కోసం విద్యార్థుల మధ్య ఘర్షణ ?

విశాలాంధ్ర- జెఎన్టియుఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల (అనంతపురం) డేను గురువారం సాయంత్రం నిర్వహించగా కళ్లద్దాల కోసం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు బయట వ్యక్తి కాలేజీ డే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన వ్యక్తి, విద్యార్థుల మధ్య కళ్లద్దాల కోసం తోపులాట చోటుచేసుకుని అది కాస్త ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఒకసారిగా ఉత్కంఠ నెలకొన్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. గొడవకు పడ్డ బయట వ్యక్తి తన అనుచర వ్యక్తులను విద్యార్థులపై పురమాయించడంతో ఘర్షణ మరింత పెరిగే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు వరకు వెళ్లడంతో ప్రిన్సిపల్ జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లు తెలిసింది.

చిన్న ఘర్షణ చోటుచేసుకుంది : ప్రిన్సిపల్ పి. సుజాత : కళాశాలలో కళ్లద్దాల కోసం చిన్న ఘటన చోటుచేసుకుంది. సమస్యను పరిష్కరించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img