Friday, May 3, 2024
Friday, May 3, 2024

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మహాత్మ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సోమవారం ఉరవకొండ మండలం బూదగవి   గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ షాజహాన్ ఏవో కేకే ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23 వరకు  గ్రామ ప్రజల కు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, చెట్లు నాటే కార్యక్రమాలతో పాటు స్వచ్ఛభారత్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఇషాక్  అహ్మద్, సత్యనారాయణ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img