విశాలాంధ్ర-రాప్తాడు : జగనన్న ఇళ్ల నిర్మాణాల, మౌలిక సదుపాయాల కల్పనపై తహశీల్దార్ లక్ష్మీనరసింహ శనివారం బొమ్మేపర్తిలో నిర్మిస్తున్న గృహాలను సందర్శించారు. తహశీల్దార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. బేస్మెంట్ స్థాయిలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ రెండు పూటలా వాటరింగ్ చేస్తూ ఉండాలన్నారు. లబ్ధిదారుల నుండి ఫిర్యాదు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన బ్రిక్స్, ఐరన్, ఇసుక, సిమెంట్ కొరత లేకుండా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరితన పూర్తయ్యేందుకు అధికారులు, సచివాల సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ చంద్రమోహన్ రెడ్డి, వీఆర్ఓ లింగారెడ్డి ఉన్నారు.