Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలం లోని విద్యార్థులు గ్రంథాలయం వారు ఏర్పాటు చేసే వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ఎం ఈశ్వరప్ప అన్నారు. శనివారం స్థానిక ఎంఆర్సి భవన్లో గ్రంధాల అధికారి ప్రతాప్ రెడ్డి తో కలిసి ఆయన వేసవి విజ్ఞాన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ శిబిరం ద్వారా విద్యార్థులలోని ప్రతిభను పైకి తీసుకురాగల మని తెలిపారు. ఈ శిబిరము మే 8 నుండి జూన్ 6వ వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, పెద్దలు చెప్పే కథలు ద్వారా కథలు వినుట, పుస్తకపఠనం, పుస్తక సమీక్ష, పెద్దల ద్వారా కథల వినుట, చెప్పుట, చిత్రలేఖనం పేపర్ ఆర్ట్స్ మొదలైన సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజు నిర్వహించబడుతున్నాయిని తెలిపారు.కావున తల్లిదండ్రులు విద్యార్థులును ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ప్రతాప్ రెడ్డి తో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img