Friday, April 26, 2024
Friday, April 26, 2024

హంస వాహనము పై నరసింహ స్వామి

విశాలాంధ్ర- ఉరవకొండ : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.వివిధ రకాల పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు.మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ  రోజు ఉదయం స్వామివారు  శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో విహరించారు. హంస వాహనంపై   దర్శనమిచ్చిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్ కుమార్, అర్చకులు  పెద్ద సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img