Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ సీమ ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో లేదు : నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేడు 95వ రోజుకు చేరుకుంది. లోకేష్ పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణ కోట్కూరులో కొనసాగుతోంది. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయన ాాగత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కొనసాగించడం చేతగాని జగన్ స్టిక్కర్లు వేసుకోవడానికి మాత్రం ఏమాత్రం వెనకాడటం లేదు. పేదల దాహార్తి తీర్చేందుకు నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరులో మా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ఇది. ఈ పథకానికి నీళ్లివ్వకుండా పాడుబెట్టిన వైసీపీ సర్కారుౌ తమ పార్టీ స్టిక్కర్లు మాత్రం వేసుకుంది. స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ సీమప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడంపై లేదేమీ జగన్మోహన్ రెడ్డీ?!్ణ్ణ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img