Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంటలు ఎలా పండిస్తారో పవన్‌కు తెలియదుౌ మంత్రి కాకాణి

  • పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్‌కు తెలియదని, పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమ‌ర్శించారు. రాజమండ్రిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని ఎగనామం పెట్టారని, సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్లు బకాయిలు కలిపి సుమారు 5 వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉందని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రొటీన్‌ గానే కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయం గురించి త‌మకు పూర్తిగా తెలుసని, చంద్రబాబు, పవన్‌లకే ఏమీ తెలియదని మంత్రి కాకాణి విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారన్నారు. సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్ల బకాయిలు కలిపి సుమారు రూ.5,000 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. వ్యవసాయం గురించి త‌మకు పూర్తిగా తెలుసు. వారికే ఏమీ తెలియదని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img