విశాలాంధ్ర-తాడిపత్రి: బిజెపి ఓబీసీ మోర్చా రాయలసీమ బీసీ సామాజిక సభను విజయవంతం చేయడని జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు,బీజేపీ జిల్లా గ్రంధాలయ్ కన్వీనర్ పోతుల గంగాధర్ యాదవ్, ఓబీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి మధుబాబు పిలుపునిచ్చారు. గురువారము విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీలను ప్రాంతీయ పార్టీలు 56 కులాలను సపరేట్గా విడగొట్టి మనలో ఐక్యతను లేకుండా చేయాలని వైసిపి పార్టీ కంకణం కట్టుకుంది.బీసీ కార్పొరేషన్ లో చైర్మన్ పదవి ఇచ్చిందే తప్ప ఏ రోజు కూడా వాళ్ళ కులానికి వాళ్లు చేసుకునే దానికి ఎలాంటి పవర్, హక్కులు గాని ఇవ్వలేదు. బీసీల కోసం ఎప్పుడు పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కావున బిసి నాయకులు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా వచ్చి మన బీసీ చైతన్యం అంటే ఏంటో ఈ యొక్క ప్రాంతీయ పార్టీలకు చూపించాలని తెలియజేస్తున్నాము.