విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కుష్టు వ్యాధి సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి జులై 16 వరకు ఆశా కార్యకర్తలు తమకు కేటాయించిన గృహాలను సందర్శించి కుష్టు వ్యాధి గ్రస్థులను గుర్తించుటకు సర్వే నిర్వహించాలని సూచించారు. ఎల్ సి డి సి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలయిన స్పర్శ లేని మచ్చలు,ముఖము కనుబొమ్మలు,ఎద,వీపు మీద నొప్పిలేని బుడిపేలు,కనురెప్పల కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవుట,ముక్కుదూలం అగిపోయి గాలి అడకపోవడం,బొటనవేలు,చిటికెనవేలు,మణికట్టు పనిచేయపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఆసుపత్రికి పంపాలని సూచించారు.రాష్టాన్ని కుష్టు వ్యాధి రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నాగరంగయ్య,హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్ఎండి షఫీ సూపర్వాసర్ శేఖర్,సీఓ భగవాన్ దాస్,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.