బీహార్లోని భాగల్పూర్కు చెందిన సుందర్వతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాలకు వచ్చే విద్యార్థినులు కచ్చితంగా జడవేసుకోవాలంటూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. అమ్మాయిలు లూజ్ హెయిర్తో వస్తే వారిని కాలేజీలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమన్ సిన్హా స్పష్టం చేశారు. అలాగే, ఈ ఏడాది ఇంటర్లో చేరిన బాలికలకు డ్రెస్ కోడ్ మొదలుకొని అనేక పరిమితులను యాజమాన్యం అమలు చేస్తోంది.సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధించారు. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ మూడు విభాగాలలో ప్రస్తుతం 1,500 మంది విద్యార్ధినులు ఉన్నారు.