Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కాబూల్‌ నుంచి భారత్‌కు సిక్కుల పవిత్ర గ్రంథాలు

అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కాబుల్‌ నుంచి 78 మంది ప్రయాణీకులు ఢల్లీికి చేరుకున్నారు. వీరిలో కొంతమంది సిక్కులు ఉన్నారు. కాబుల్‌లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్‌కు చెందిన మూడు ప్రతులను ఇక్కడికి తీసుకు వచ్చారు. ఇవాళ ఉదయం ఢల్లీి విమానాశ్రయంలో వీటిని మంత్రి హరిదీప్‌ అందుకున్నారు. ఆ గ్రంథాలను తలపై పెట్టుకుని ఆయన విమానాశ్రయం బయటకు వచ్చారు. సిక్కు మతంలో గురు గ్రంథ్‌ సాహిబ్‌కు విశిష్ట స్థానం ఉంది. సిక్కు మతస్తులు ఆ గ్రంథాలను అత్యంత పవిత్రంగా చూస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img