విశాలాంధ్ర- బుక్కరాయ సముద్రం : బక్రీద్ పండుగను ముస్లింలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని అనంతపురం డిఎస్పీ వెంకట శివారెడ్డి పేర్కొన్నారు. బుక్కరాయ సముద్రం పోలీస్టేషన్ లో మంగళవారం ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోవధని నిషేధించడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.ప్రార్థనా మందిరాల వద్ద మత పరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.