హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా నుంచి జులై 4న కొత్త సెల్టోస్ విడుదల చేస్తున్నామని కియా ప్రాంతీయ ప్రతినిధి వెల్లడిరచారు. కొత్త అవతారంలోని సెల్టోస్, తాజా డిజైన్ శ్రేణిలోనే మెరుగైన ఫీచర్స్ను కలిగి ఉందన్నారు. తమ శ్రేణిలోని ప్రముఖ ఫీచర్స్, డిజైన్ నాయకత్వంతో ఆటోమొబైల్ పరిశ్రమలోనే సెల్టోస్ బ్రాండ్ కొత్త విప్లవాన్ని ఆరంభించిందన్నారు. కొత్త సెల్టోస్ శ్రేణిని మరోసారి పునః కనుగొనడానికి సిద్ధంగా ఉందని, కియా జూన్ 30న కొత్త సెల్టోస్ టీజర్ను కూడా విడుదల చేసిందన్నారు. ఆగస్ట్ 2019లో కియా సెల్టోస్ ఆవిష్కరణతో భారతదేశపు మార్కెట్లోకి అడుగు పెట్టిందని, భారతదేశపు ఆధునిక వినియోగదారుల హృదయాలను చూరగొంది. అతి తక్కువ సమయంలో కేవలం 46 నెలల్లో, సెల్టోస్ 5 లక్షల మైలురాయి సేల్స్ను దాటిన అతి వేగవంతమైన ఎస్యూవీగా మారిందని తెలిపారు.