Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జగనన్న సురక్షతో అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : జగనన్న సురక్ష పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై ఒకటవ తేదీ నుండి గ్రామ వార్డు సచివాలయాల వద్ద జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని దీనికి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బడే వారి పాలెం, నేకునాంపురం గ్రామ సచివాలయాల నందు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రారంభించినారు.

ఆయన మాట్లాడుతూ, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు 11 రకాల సేవలను ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగనుందని అన్నారు . జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ అధికారులు సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేస్తారని, ఈ క్రమంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలతో మాట్లాడి వారికి అసవరమైన సేవలకు సంబంధించిన అభ్యర్థనను రిజిస్టర్‌ చేస్తారని అన్నారు క్యాంపు నిర్వహించే రోజున సరైన ధ్రువీకరణ పత్రాలతో హాజరయ్యేలా చైతన్య పరుస్తున్నారని, క్యాంపులోనూ సమస్యలపై అభ్యర్థనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, 30 రోజులలో
15 వేల క్యాంపులతో 5.3 కోట్ల మంది ప్ర‌జ‌లకు చేరువై ప్ర‌తి గ్రామంలో, ప్ర‌తి ఇంట్లో ఏ చిన్న స‌మ‌స్య ఉన్నా ప‌రిష్క‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మం అని చెప్పారు. మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజల వద్దకే చేర్చడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఇంటూరి భారతి ఎంపీపీ పోనుగోటి మౌనిక,ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ,సర్పంచ్ లు కొల్లూరి లక్షమ్మ,దార్ల కోటేశ్వరమ్మ,ఎస్ ఐ లు బి.బి. మహేంద్ర నాయక్,వి.వెంకటేశ్వర్లు,పోలీస్ సిబ్బంది, మండల జెసిఎస్ కన్వీనర్ అనుమొలు వెంకటేశ్వర్లు, మీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరస్వామి,వైసీపీనాయకులు ఇంటూరి హరిబాబు,నల్లమోతు చంద్ర మౌళి ,కొల్లూరి లక్ష్మినరసింహం,కట్టా హనుమంతురావు,కుంబాల క్రాంతి,కొల్లూరి గోవిందు,మద్దాలి రామారావు,నరసింగరావు, కోటయ్య, వేణు కంచర్ల బాలాజీ,సర్పంచ్ చెన్నెబోయిన ఓబులు కొండయ్య,ప్రగడ వెంకటేశ్వర్లు,అనుమోలు వెంకటస్వామి, చెన్నెబోయిన శ్రీను, ప్రభుత్వ అధికారులు,వైయస్సార్ సిపి ముఖ్య నాయకులు, కన్వీనర్సు వలంటీర్లు, గృహ సారథులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు.లి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img