విశాలాంధ్ర -భీమడోలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులందరికి అందించడమే జగనన్న సురక్ష పథకం సంకల్పమని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు.బుధవారం భీమడోలు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమానికి సర్పంచ్ పాము సునీతా మాన్సింగ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వాసుబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తుదారులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వారి ఇంటి వద్దకే అందజేసేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకుందన్నారు. ఎంపీపీ కనమాల రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే వాసుబాబు చేతుల మీదుగా అందించారు. సచివాలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ పి.విజయరాజు, ఎంపీపీ కనమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగా, ఏఎంసీ ఛైర్ పర్సన్ ఇంజేటి నీలిమా జూనియర్, ఎంపీడీవో సీహెచ్ పద్మావతిదేవి, తహసీల్దార్ ఎం.ఇందిరాగాంధీ, భీమడోలు సొసైటీ అధ్యక్షులు రావిపాటి సత్యశ్రీనివాస్, పసుపులేటి సత్యనారాయణ, ముళ్లగిరి జాన్సన్, మద్దుల రాజా తదితరులు పాల్గొన్నారు.