విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ ఆవరణంలోని వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రఘురామ్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి డాక్టర్ అయినందున పేద ప్రజల కోసం 108, 104, ఉచిత వైద్య సేవలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో నిలిచి పోయారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. అలాగే రైతులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవిచంద్రా రెడ్డి, విజయేంద్ర రెడ్డి, గజేంద్ర రెడ్డి, బ్రహ్మయ్య, ముక్కరన్న, అర్లప్ప, వీరేష్, హనుమంతురెడ్డి, చంద్రశేఖర్, సుందరం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.