పూణే: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ జనరల్ అలియంజ్ ఇన్సూరెన్స్ 3 జులై, 2023న మొట్టమొదటి జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (జిఐఎఫ్ఐ)ని నిర్వహించింది. ఒక ఇన్సూరెన్స్ కాన్ఫరెన్స్లో అత్యధిక హాజరుతో ఇది అధికారికంగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. రికార్డుస్థాయిలో 5235 వ్యక్తులు ఈ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. వీరు ఇన్సూరెన్స్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్త చరిత్ర సృష్టించేందుకు దోహదపడ్డారు. జిఐఎఫ్ఐ ప్రధాన ఈవెంట్లో ఈ సరికొత్త రికార్డు ప్రకటితమైంది. సంస్థ గతంలో జిఐఎఫ్ఐ అవార్డులను గురించి ప్రకటన చేసింది. అప్పుడు వారు ఇన్సూరెన్స్ పరిశ్రమలో అత్యుత్తమ ర్యాంక్ పొందిన హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లను గుర్తించేందుకు నామినేషన్లను ఆహ్వానించారు. తదనంతరం, జిఐఎఫ్ఐ అవార్డుల కోసం అడ్వైజర్లు వారి నామినేషన్లను సమర్పించారు. ప్రకటించిన ఐదువిభాగాల్లో 2000 కంటే ఎక్కువ ఎంట్రీలతో అద్భుతమైన ప్రతిస్పందన లభించింది.