ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య
విశాలాంధ్ర – ధర్మవరం : ఏలూరు జిల్లా పులి రామన్న గూడెంలో గిరిజన సంక్షేమ హాస్టల్లో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిల్ రెడ్డి హత్యకు కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు శివ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ బాలుర హాస్టల్ యందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అఖిల్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో నిరసనను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెద్దపీట వేస్తానని చెప్పి కనీసం విద్యార్థుల కనీస రక్షణ కల్పించే విధంగా లేకపోవడం దుర్మార్గమైన చర్య అని వారు తెలిపారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసీన్,మురళి, ఎస్సీ హాస్టల్ అధ్యక్ష, కార్యదర్శులు. జైపాల్, విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు. సురేష్, దినేష్,సునీల్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.