Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

‘దేశ్‌ కే మెంటర్స్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోనూసూద్‌

దిల్లీ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ‘దేశ్‌ కే మెంటర్స్‌’ ప్రోగ్రాంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ పనిచేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మీడియా సమావేశంలో సోనూసూద్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. త్వరలోనే ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. సోనూసూద్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు. లక్షలాది మంది విద్యర్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈరోజు లభించిందని, విద్యార్థులకు నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img