సిపిఐ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే భారత కమ్యూనిస్టు పార్టీకి విరివిగా విరాళాలు ఇచ్చి తోడ్పాటును అందించాలని ఆ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అన్నారు. మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు దీసరి. బీమలమ్మ తో కలిసి చింతపల్లి వచ్చిన ఆయన ఆ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్ కలెక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చింతపల్లిలో వారపు సంత కావడంతో పార్టీ శ్రేణులతో కలిసి విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు ప్రజలు అందిస్తున్న విరాళాలే ఆర్థిక బలమని, ప్రతి ఏట తమ పార్టీకి ప్రజలు ఇస్తున్న విరాళాలు, వారు తెలుపుతున్న సంపూర్ణ మద్దతు కారణంగానే సుమారు 99 ఏళ్లపాటు తమ పార్టీ మనుగడ సాగించగలిగిందని ఆయన గుర్తు చేశారు. మరో ఏడాదిలో శతాబ్ద కాలానికి చేరుతుందని, ఈ యొక్క ఘనత ప్రజలదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబొమ్మల ఎంపిటిసి సభ్యుడు సెగ్గే సత్తిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ రహిమాన్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు మఠం సూరి పడాల్, కామేశ్వరరావు, గోపాలరావు, అప్పలనాయుడు అధిక సంఖ్యలో ఆ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.