లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే విచారణ చేయాలి, పింఛన్ ఆపకూడదు …
పింఛనుదారులకు ఊరటనిచ్చిన కర్ణాటక హై కోర్టు …
విశాలాంధ్ర – చోడవరం( అనకాపల్లి జిల్లా) : తే.30.01. 2024 ది. ప్రభుత్వ ఫించను దారులు ఫించను పొందేందుకు ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు రిట్ పిటిషన్ నం. 405/23 లో
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేని పింఛనుదారుల పింఛన్ ఆపకూడదని తీర్పు వెలువరించింది. పింఛనుదారుడు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే, అతని పెన్షన్ ఆపడానికి ముందు, పింఛనుదారుని ఇంటిని సందర్శించి, సమర్పించకపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడం బ్యాంకు విధి అని కోర్టు తెలియజేసింది.
అన్ని బకాయిలను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరియు జరిమానా కూడా విధించింది. ఒక లక్షకు
6% వడ్డీతో రెండు వారాల్లో చెల్లింపు చేయాల్సిందిగాను,
2 వారాల్లో చెల్లింపు చేయకపోతే, వడ్డీ రేటు 18% శాతం వడ్డీకి పెరిగుతుందని తీర్పు వెలువరించింది.
బ్యాంకర్లు అందరూ గమనించాలి అన్నారు.
పింఛనుదారులందరికీ ఉపయోగకరమైన తీర్పును విలువరించిన న్యాయస్థానం పట్ల పలువురు ప్రభుత్వ పింఛనుదారులు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.