. అధ్యక్షుడు మయిజ్జు వ్యాఖ్యలు అసత్యం
. మాల్దీవుల మాజీ మంత్రి షాహిద్
మాలే: మాల్దీవుల్లో భారత సైనికులెవరూ లేరని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ పేర్కొన్నారు. అక్కడ వందలమంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే మయిజ్జు ఇలాంటి అవాస్తవా లను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారని.. అందులో ఇదొకటని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న ‘మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేశారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ తెలిపింది. కానీ, భారత్తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని షాహిద్ అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మయిజ్జు పదే పదే అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి వైదొలుగుతాయని ముయిజ్జు ఇటీవల వెల్లడిరచారు. భారత్కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.