Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించటం లోనే నిజమైన సంతృప్తి ఉంది..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు, ( చిట్టి), అధ్యక్షులు బంధనాథం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో 99 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టి, వందనాథం రమణ,సిరివెళ్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరము తాము 2010లో ప్రారంభించడం జరిగిందని. అప్పటినుంచి ఇప్పటివరకు 99 వైద్య శిబిరములు నిర్వహించడం మాకెంతో గర్వంగా ఉందని తెలిపారు. జూన్ నెలలో మూడవ వైద్య చికిత్స శిబిరమును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు, రోగులకు మరింత వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులురెడ్డిపల్లి సుబ్బమ్మ, కీర్తిశేషులు రెడ్డిపల్లి రామప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు ఆర్ రాజేశ్వరి ఆర్ రామచంద్ర సాయి మనోజులు వ్యవహరించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా నిష్ణాతులైన వైద్యులైన డాక్టర్ వివేకుల్లయప్ప-దంత వైద్యులు, డాక్టర్ వెంకటేశ్వర్లు-చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సాయి స్వరూప్-జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం- సర్జన్ హైదరాబాద్, డాక్టర్ వినయ్ కుమార్ వారు రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా తెలియజేశారు. ఈ శిబిరంలో 226 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి బండి నాగరాజు, సభ్యులు విజయ్, బండి ఆంజనేయులు, ఆదినారాయణ, దాసరి దేవా, బండి మనీ, బండి పవన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img