శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: సేవాగుణమే సమాజంలో మంచి గుర్తింపు తెస్తుందని శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 6 గంటలకు దాదాపు 200 మంది రోగులకు పాలు తో పాటు బ్రెడ్, బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి భజన మండలి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు రోగులకు వరం లాగా మారడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, రోగులు తరఫున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచారి, వై. వెంకటేష్, నారాయణరెడ్డి, నాగిరెడ్డి, జనార్ధన, సాంబశివుడు లతోపాటు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.