విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని గోట్లురు గ్రామంలోని వృద్ధ అనాధాశ్రమంలో పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు కందికుంట జయరాములు, భార్య వెంగమ్మ దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు రాజశేఖర్, నాగలక్ష్మి, గీత, రాజు, మనోహరి, సాయి తదితరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనాధలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని, ప్రతి ఒక్కరూ కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమమైనా సరే అనాధాశ్రమంలో భాగస్వాములు అయితే, మానవతా విలువలు పెరుగుతాయని, ప్రేమ యొక్క విలువలు తెలుస్తాయని వారు తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రఫుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు యశస్విని, గౌతమ్ ,అఖిల్ ,వెంకీ, భారతి, తేజస్విని, గోవింద్, రమణ, కేశవ్,జ్యోతి నిరోషా తదితరులు పాల్గొన్నారు.